+91 95819 05907

బోనకల్ లో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

బోనకల్ లో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

    – బోనకల్ మండలంలో 69.55శాతం పోలింగ్

    నేటి గదర్ న్యూస్, మే 27, బోనకల్ / ఖమ్మం జిల్లా ప్రతినిధి :

    ఖమ్మం – నల్గొండ- వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సోమవారం బోనకల్ మండలంలో ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో బోనకల్ మండలంలో 1971 మంది ఓటర్లు ఉండగా 1371 మంది ఓటర్లు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 681మంది మహిళలు 490 మంది ఓట్లు వేశారు. మండలంలో 69.55 శాతం పోలింగ్ నమోదయింది. పట్టభద్రులు ఉదయం 9 గంటల నుండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జంబో బ్యాలెట్ పేపర్ కావడంతో పాటు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే నెంబర్లు ఎక్కువగా ఉండడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువ సమయం పట్టింది. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తహశీల్దార్ అనిశెట్టి పున్నం చందర్, ఎంపిడిఓ ఎల్ రాజు, గిర్ధావర్ గుగులోతు లక్ష్మణ్ లు క్షేత్రస్తాయి సిబ్బందితో కలిసి మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ ఉపఎన్నిక సరళిని మధిర సిఐ డి మధు, స్థానిక ఎస్సై మధుబాబుతో కలిసి పరిశీలించారు. ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్

​పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

Read More »

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి

Read More »

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

 Don't Miss this News !