+91 95819 05907

తీన్మార్ మల్లన్నదే విజయం:తోట

నేటి గదర్ న్యూస్, మే 27, బోనకల్ / ఖమ్మం జిల్లా ప్రతినిధి :

సోమవారం జరిగిన ఖమ్మం నల్లగొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నదే విజయమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు అన్నారు. బోనకల్ మండల కేంద్రంలో పిసిసి సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్, సిపిఎం నాయకులు బంధం శ్రీనివాస్ రావు లలో కలసి ఆయన ఓటింగ్ సరళని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బోనకల్ మండలంలో 1971 పైచిలుకు ఓట్లు ఉండగా సుమారు 1371 ఓట్లు పోలైనట్లు పేర్కొన్నారు. పోలైన ఓట్లలో 50 శాతానికి పైగా తీన్మార్ మల్లన్నకు పడే అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా వామపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందని తద్వారా ఎన్నికలలో తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం అన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రజల గెలిపించినప్పటికీ తన స్వార్థం కోసం రాజీనామా చేసి ఉపఎన్నికకు కారణమయ్యాడన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్ బారాసాను కూడా గెలిపించే పరిస్థితి లేదన్నారు. వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి వైపే నిరుద్యోగులు, మేధావులు, పట్టభద్రులు చూస్తున్నట్లుఉంటుంది కనిపించిందన్నారు. కనుక తీన్మార్ మల్లన్నకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ బోనకల్ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, సిపిఎం మండల నాయకులు గుగులోతు పంతు, తెల్లాకుల శ్రీను, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాలి దుర్గారావు ,కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామాకోటేశ్వరావు,వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్ కాంగ్రెస్ నాయకులు ,తమ్మారపు వెంకటేశ్వర్లు, పాసంగులపాటి కోటేశ్వరరావు, చిలక వెంకటేశ్వర్లు, సుబ్బారావు, పల్లిపాటి తిరుపతిరావు, తమ్మారపు బ్రహ్మయ్య , సిపిఐ మండల సహాయ కార్యదర్శిలు జక్కుల రామారావు, ఆకేన పవన్, యూత్ కాంగ్రెస్ నాయకులు భూక్య భద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !