+91 95819 05907

ఫుడ్ సెక్యూరిటీ అధికారుల రైడ్స్

కల్తీ కల్తీపై కొరడా చూపించిన ఫుడ్ సెక్యూరిటీ అధికారులు
– భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు
– పాడైపోయిన ఆహార పదార్థాలను ధ్వంసం చేసిన అధికారులు
– నిబంధనలను పాటించని హోటళ్లకు నోటీసులు, జరిమానా
– లాభార్జన కోసం కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం ఫుడ్ సెక్యూరిటీ స్పెషల్ డ్రైవ్ జోనల్ అధికారిని జ్యోతిర్మయి

నేటి గదర్, మే 27, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ ను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని శ్రీ భద్ర గ్రాండ్ హోటల్, శ్రీ గౌతమి స్పైస్ హోటల్ , శ్రీ రాఘవేంద్ర టిఫిన్ అండ్ మీల్స్ హోటల్ పై ఫుడ్ సేఫ్టీ బృందాలు జోనల్ అధికారిణి వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాగా శ్రీ భద్ర హోటల్ లో రిఫ్రిజిరేటర్ లో ఉంచిన 88 లీటర్ల ఐస్ క్రీం ఫంగస్, పురుగులతో దుర్వాసన రావడంతో జోనల్ ఫుడ్ సేఫ్టీ అధికారిణి జ్యోతిర్మయి హోటల్ యాజమాన్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడే ప్రజల ఆరోగ్యానికి భంగం కలవకూడదని 36 వేల విలువచేసే బూజు, పురుగులు పట్టిన ఐస్ క్రీమ్ ని ధ్వంసం చేసి సదరు హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. క్యాన్సర్ కారకాలైన కృత్రిమ హానికరమైన రంగులను బిర్యానీ, తదితర ఆహార పదార్థాలలో కలిపి, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేసి, అమ్మకాలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న సదరు హోటల్ యాజమాన్యంకు FSSA చట్టానికి సంబంధించిన నోటీసులను జారీ చేసి, సుమారు 10 కేజీల రంగు కలిపిన బిర్యానిని ధ్వంసం చేసి, గ్రామపంచాయతీ అధికారుల చేత పదివేల రూపాయల జరిమానా విధించి రెక్టిఫికేషన్ కోసం హోటల్ మూసి వేయాలని ఆదేశించారు. హోటల్ గౌతమి స్పైసెస్ వద్ద మొత్తం దుమ్ము ధూళితో, ఈగలు, పురుగులతో ఉన్న అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తూ, హానికరమైన రంగులను ఆహార పదార్థాలు వినియోగిస్తున్నందున, పెస్ట్ కంట్రోల్ చేయకుండా, ఆహార పదార్థాలు తయారు చేస్తున్న చోట డ్రైనేజ్ వాటర్, చెత్త, ఈగలు ఉండడంతో నిలువ చేసిన ఆహార పదార్థాలు రిఫ్రిజిరేటలో గమనించడంతో అవన్నీ ధ్వంసం చేసి ఆ యాజమాన్యానికి FSSA చట్టపరమైన నోటీసులు జారీ చేసి, గ్రామపంచాయతీ భద్రాచలం వారిచే 25 వేల రూపాయల జరిమానా విధించి నిర్ణీత గడువులో రెక్టిఫై చేయించుకోకపోతే హోటల్ శాశ్వతంగా సీజ్ చేస్తామని హెచ్చరించడం జరిగింది. రాఘవేంద్ర టిఫిన్స్ అండ్ మీల్స్ హోటల్లో అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తూ, పాలలో, ఇడ్లీ పిండిలో చచ్చిపోయిన ఈగలు, వండిన వంకాయ టమాట కూరలో బిల్డింగ్ కప్పు నుండి బూజు, మట్టి వ్యర్థ పదార్థాలు రాలి పడినప్పటికీ ప్రజలకు అమ్ముతున్నందున, లైసెన్స్ డిస్ప్లే చేయకుండా ఉండడం వల్ల, సబ్బులు డిటర్జెంట్స్, కెమికల్స్ ఉండే ప్రదేశంలో పల్లీలు, ఇడ్లీ పచ్చడి లాంటివి పెట్టి కల్తీ కి పాల్పడుతుండడం వలన వాళ్లకు మూడు రకాల నోటీసులు జారీ చేసి, 5,000/- రూపాయల పెనాల్టీ విధించడం విధించారు. అనంతరం ఫుడ్ సెక్యూరిటీ అధికారులు మాట్లాడుతూ… ప్రజలకు అమ్మే ఆహారం సుచిగా, శుభ్రంగా, సురక్షితంగా ఉండాలని, లాభార్జన కోసం, ధనార్జన కోసం ఎటువంటి కల్తీలకు పాల్పడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే క్రిమినల్ కేసులు అవసరమైతే కేసు తీవ్రతను బట్టి జైలుకు పంపించడం జరుగుతుంది అని స్పెషల్ డ్రైవ్ జోనల్ అధికారిని జ్యోతిర్మయి తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ దాడులలో భద్రాద్రి కొత్తగూడెం ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆర్.కిరణ్ కుమార్, యాదాద్రి, నల్గొండ ఫుడ్ ఇన్స్పెక్టర్ పి.స్వాతి, వనపర్తి, గద్వాల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ, భద్రాచలం గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్ కృష్ణ అర్జున్ రావు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !