రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శనివారం నాడు బిఆర్ఎస్ పార్టీ పట్టణ ముఖ్య నాయకులు గజవాడ నాగరాజు, సరాపు యాదగిరి లు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం పాఠకులకు విధితమే.కాగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు స్వగృహంలో అయన సమక్షంలో నేడు రామాయంపేట పట్టణానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాపు యాదగిరి తో సహా పలువురిని కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
Post Views: 22