కస్తూరిబా హాస్టల్ బాలిక అదృశ్యం
– పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
నేటి గదర్, ఫిబ్రవరి 2,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 17 సంవత్సరాల బాలిక మిస్సయిన సంఘటన బూర్గంపాడు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… బూర్గంపాడు కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 17 సంవత్సరాల బాలికను ఆమె వదిన సుమలత అను మహిళ బాలికకు కావలసిన సామాన్లు కొనించేందుకు బయటకు తీసుకొని వెళ్లేందుకు రెండు గంటలు అనుమతి కావాలని లెటర్ రాసి సంతకం పెట్టి తీసుకువెళ్లింది. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో హాస్టల్ అధికారులు ఆమె ఫోన్ కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బూర్గంపాడు కస్తూరిబా బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ మాలోజ్ సుమలత బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విచారణలో బాలిక వదిన సిసింద్రీ అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై బాలికలు పంపించినట్లు తెలిసిందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బూర్గంపాడు ఎస్సై ఈ రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు.