+91 95819 05907

యుద్ధకళ నేర్చుకుంటే ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యం వరిస్తుంది

★చదువుకునే విద్యార్థినిలకు కరాటే నేర్చుకోవడం వల్ల భవిష్యత్ ఉంటుంది

నేటి గదర్ న్యూస్ ప్రతినిధి, ఖమ్మం : జాతీయ స్థాయి కరాటే పోటీలు ఆదివారం స్థానిక వర్తక సంఘం భవనం (ఛాంబర్ అఫ్ కామర్స్ కామర్స్ ) లో సైదులు కరాటే స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించారు . ఈ కార్యక్రమాన్ని ఖమ్మం 3 టౌన్ సిఐ టి రమేష్ ప్రారంభించగా ట్రాఫిక్ సీఐ-2 సాంబశివరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు . సాయంత్రం జరిగిన బహుమతి ప్రధానోత్స కార్యక్రమానికి తుమ్మల యుగంధర్ అన్న పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు . సుమారుగా 50 స్కూల్ నుండి 1000 విద్యార్థులు ఈ కరాటే పోటీలలో పాల్గొన్నారు . బ్లాక్ బెల్ట్ గ్రాండ్ ఛాంపియన్షిప్ గర్ల్స్ ఎస్కే రిజహర్ గెలుపొందగా , బాయ్స్ ఎస్.కె ఆదిల్ పాషా బ్లాక్ బెల్ట్ గ్రాండ్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు . ఈ యొక్క పోటీలకు న్యూ విక్టరీ టాలెంట్ హై స్కూల్ కరస్పాండెంట్ బొల్లా మోహన్ రెడ్డి , బొల్లా రమేష్ రెడ్డి లు సహాయ సహకారాలు అందజేశారు . ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రాము , బాబు , గాఫుర్ , సందేశ్ , వీరన్న , ఖాసీం తో పాటు చాలామంది కరాటే మాస్టర్ లు పాల్గొన్నారు . ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ చదువుకునే విద్యార్థినిలకు కరాటే భవిష్యత్ లో ఉపయోగపడుతుందని , ఇది శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని , చిన్నపిల్లలకు శారీరకంగా మరియు మానసికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాన్ని అందిస్తుందని , కరాటే అనేది అన్ని వయసుల వారికి ఉపయోగపడే క్రమశిక్షణ , ఫిట్నెస్ నియమావళి మరియు ఆత్మరక్షణ యొక్క ఒక రూపమును పొందుపరుస్తుందని తెలిపారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది వివరాలు విడుదల :ఎంపీడీవో సునీల్ కుమార్

పినపాక, నేటి గదర్ న్యూస్ : పినపాక మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది జాబితా విడుదల చేశామని పినపాక ఎంపీడీవో సునీల్ కుమార్ తెలియజేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆ జాబితా

Read More »

జంతువుల సంరక్షణకు అండర్ పాసులు నిర్మించాలి రేంజ్ అధికారి విద్యాసాగర్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అటవీ రేంజ్ అధికారి కార్యాలయంలో సోమవారం నాడు స్థానిక విలేకర్లతో రామాయంపేట అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ

Read More »

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పుష్కర బ్రహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి.ఈ సందర్బంగా శ్రీ వెంకటేశ్వర

Read More »

లక్ష డప్పులు-వెయ్యి గొంతుల కార్యక్రమం గోడపత్రిక ఆవిష్కరణ

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు-వెయ్యిగొంతులు అనే కార్యక్రమానికి సంబంధించి సోమవారం మెదక్

Read More »

శిశుమందిర్ పాఠశాలలో 56 మంది పిల్లలకు అక్షరాభ్యస కార్యక్రమం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శ్రీ అశోక్ సింఘాల్ శిశుమందిర్ లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా శిశుమందిర్ లో పిల్లలకు సామూహిక

Read More »

ప్రజా సమస్యల కోసం ప్రజావాణి కార్యక్రమం తహసీల్దార్ రజనీకుమారి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం

Read More »

 Don't Miss this News !