+91 95819 05907

జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

.

పినపాక,ఫిబ్రవరి 03:

పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గోపాలరావు పేట గ్రామంలోని క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ ని సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. అనంతరం వారు మాట్లాడుతూ పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. మండలంలోని అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో కలిపి టోర్నమెంట్ నిర్వహించడం వలన అన్ని శాఖల ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొంటాయని అన్నారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా, ఒత్తిడిలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి క్రీడలలో పాల్గోనడం వలన మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చు అని అన్నారు. ప్రస్తుతం యువత క్రికెట్ క్రీడ పట్ల ఆసక్తి కలిగి ఉంటున్నారని అన్నారు. ఆదివారం జరిగిన మహిళల అండర్ 19 వరల్డ్ కప్ ని భారత జట్టు గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మహిళల క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ కప్ టోర్నమెంట్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ని సొంతం చేసుకున్న భద్రాచలం కి చెందిన క్రీడాకారిణి గొంగడి త్రిషను ప్రత్యేకంగా అభినందించారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో జన్మించి పట్టుదలతో అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లా పేరును నిలబెట్టడం పట్ల జిల్లా ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. యువత చదువు తో పాటు క్రీడలలో రాణించడం వలన పుట్టి పెరిగిన గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం, ప్రెస్ క్లబ్ సభ్యులు బిల్లా నాగేందర్, భూరా శంకర్, కీసర సుధాకర్ రెడ్డి, సనప భరత్, ముక్కు మహేష్ రెడ్డి, కట్టా శ్రీనివాసరావు,కొంపెల్లి సంతోష్, గాడుదల దిలీప్, నగేష్, కోటి, జగదీష్, సాయి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గొపాలరావుపేట గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది వివరాలు విడుదల :ఎంపీడీవో సునీల్ కుమార్

పినపాక, నేటి గదర్ న్యూస్ : పినపాక మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది జాబితా విడుదల చేశామని పినపాక ఎంపీడీవో సునీల్ కుమార్ తెలియజేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆ జాబితా

Read More »

జంతువుల సంరక్షణకు అండర్ పాసులు నిర్మించాలి రేంజ్ అధికారి విద్యాసాగర్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అటవీ రేంజ్ అధికారి కార్యాలయంలో సోమవారం నాడు స్థానిక విలేకర్లతో రామాయంపేట అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ

Read More »

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పుష్కర బ్రహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి.ఈ సందర్బంగా శ్రీ వెంకటేశ్వర

Read More »

లక్ష డప్పులు-వెయ్యి గొంతుల కార్యక్రమం గోడపత్రిక ఆవిష్కరణ

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు-వెయ్యిగొంతులు అనే కార్యక్రమానికి సంబంధించి సోమవారం మెదక్

Read More »

శిశుమందిర్ పాఠశాలలో 56 మంది పిల్లలకు అక్షరాభ్యస కార్యక్రమం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శ్రీ అశోక్ సింఘాల్ శిశుమందిర్ లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా శిశుమందిర్ లో పిల్లలకు సామూహిక

Read More »

ప్రజా సమస్యల కోసం ప్రజావాణి కార్యక్రమం తహసీల్దార్ రజనీకుమారి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం

Read More »

 Don't Miss this News !