★ఏ ఎస్పి డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లు దొర
భద్రాచలం ఐటీడీఏ దర్బారు నందు ఆదివాసిల సమస్యలతో కూడిన వినతిపత్రం పిఓ కి సమర్పిస్తూ ఐటీడీఏ ద్వారా ఆదివాసులకు అందాల్సిన మౌలిక పథకాలు అందిపుచ్చుకోవడంలో ఆదివాసులు ఇంకా వెనుక బాటు తనానికే గురవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఐటీడీఏ ద్వారా లబ్ధి పొందాల్సిన పథకాల ఫలాలు లబ్ధి పొందడంలో విఫలమవుతున్నారని వాపోయారు. అసలైన ఆదివాసులకు దక్కాల్సిన ఐటిడిఎ ఫలాలు నకిలీ ఎస్టీల పాలవుతున్నాయని ,కొందరు అధికారులు పూర్తిగా ఆదివాసులకు ఐ టి డి ఏ పథకాలు అందించడంలో నిర్లక్ష్యం జరుగుతుందని అన్నారు. ఉద్యోగ విషయంలో గాని విద్య విషయంలోగా మౌలిక పథకాల విషయంలో గాని నిజమైన ఆదివాసులకు పథకాలు అందేలా కృషి చేయాలని పిఓ ని కోరడమైనది అని తెలిపారు. అదేవిధంగా ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు , నీటి సౌకర్యం లేని రెవెన్యూ భూములకు గిరి వికాసం పథకం కింద పంట బోర్లు అందించి ఆ యొక్క సాగు పంటలకు నిరంధించాలని మనవి చేశారు అదేవిధంగా సాగు చేస్తున్న రెవెన్యూ భూములకు పట్టాగలిగిన పోడు భూములకు ఆదివాసి రైతులు పంట బోర్లు వేయించడానికి అనుమతి ఇవ్వాలని విన్నవించారు .తమ వినతుల పట్ల పిఓ సానుకూలంగా స్పందిస్తూ ఆదివాసి సమస్యల పరిష్కారానికి త్వరలోనే పరిష్కరిస్తానని పిఓ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు డివిజన్ ప్రధాన కార్యదర్శి కొరస రామచంద్రయ్య, కార్యదర్శి కోరం మురళి, నరేష్, రామ్మూర్తి, సర్వేష్ ర రావు తదితరులు పాల్గొన్నారు.