రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 11:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చెందిన ఎండి.రసూల్ గత కొద్దిరోజులుగా వెన్నుపూసతో అనారోగ్యంగా బాధపడుతున్నాడు.ఈ విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తక్షణమే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరు చేశారు.రాయాలపూర్ గ్రామంలో మంగళవారం నాడు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అయనకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 137









