నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రము లో విద్యాశాఖ మంత్రి నీ నియమించాలని రాష్టంలో విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని పి డి ఎస్ యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ రామనరసయ్య విజ్ఞాన కేంద్రం కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా పి డి ఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి రెండు సంవత్సరాల కాలం గడుస్తున్న నేటి వరకు విద్యాశాఖ మంత్రి నియమించకుండా కాలయాపన చేయడం రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేది అన్నట్టు ఉన్నది వ్యవహారం విద్యాశాఖ మంత్రి లేనందువల్ల తెలంగాణ రాష్ట్రంలో అత్యా రంగ పరిస్థితులు పూర్తిగా నాశనం అయితున్నాయి. విద్యారంగాని అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ విద్యారంగాని పూర్తిగా గాలికి వదిలేసింది అని అన్నారు
అలాగే పేద విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకుండా కాలయాపన చేయడం వల్ల విద్యార్థులు కళాశాల యాజమాన్యాల ద్వారా అనేక రకాల ఇబ్బందులు ఎదురుకుంటున్నారు వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని అన్నారు.
అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని అన్నారు ఆరోకోరా నిధులు కేటాయించడం వల్ల విద్యారంగం అభివృద్ధి కి నోచుకోవడం లేదు అని అన్నారు. జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.యూనివర్సిటీ లకు. స్వయంప్రతిప్రతిని ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చెర్యలు చేపట్టాలని,రాష్టంలో 5,6వ తరగతిలో డిటెన్షన్ విధానం రద్దు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు, జిల్లా నాయకులు వినయ్,పృథ్వి,సాదిక్,సందీప్, యశ్వంత్ ,నసీర్, వెంకటేష్, అశోక్, ప్రసాద్, శ్రీ నాధ్, లు పాల్గొన్నారు.
