● పి డి ఎస్ యూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమించుకొని వేలం వేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడిదారుల దాహం తీర్చేందుకే భూముల అమ్మకానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని పి డి ఎస్ యూ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా పి డి ఎస్ యూ వెంకటేష్ మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూమిని ఎరగా చూపి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టుపెట్టే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కి లేదన్నారు.
యూనివర్సిటీల అభివృద్ధికి కృషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా భూములనే కొల్లగొట్టేందుకు సిద్ధమైతే భవిష్యత్తులో యూనివర్సిటీలో ఉనికి ప్రమాదకరంగా మారునుంది. ప్రభుత్వాల నుండి ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితిలను గమనించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు భవిష్యత్తులో ప్రయోగశాలలకు అవసరమైన భూములు చేజారిపోతే భవిష్యత్ తరాల విద్యార్థులకు యూనివర్సిటీ ఉనికికి ప్రమాదమని న్యాయబద్ధంగా భూముల రక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కి అక్రమ అరెస్టులకు పాల్పడుతుంది. కెసిఆర్ ను తరిపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. ఇలాంటి నియంతృత్వ విధానాలను కొనసాగించిన కేసీఆర్ ను గద్ద దింపి కాంగ్రెస్ ను అధికార పీఠాన్ని ఎక్కిస్తే విద్యార్థులని చూడకుండా పోలీసులతో దుశ్చర్యాలను కొనసాగిస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అక్రమ అరెస్టును పి డి యస్ యూ తీవ్రంగా ఖండిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి పోలీసులు వెనకకు వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. భూముల అమ్మకాన్ని విరమించుకోవాలి. లేనిపక్షంలో ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.