– మెదక్ పట్టణంలోని పలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే
– పవిత్ర ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం పూర్తిచేసుకోవడం విశేషం
– మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మార్చి 31.
మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ పండుగ అని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. సోమవారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకోని మెదక్ పట్టణంలోని నవాపేట, గాంధీనగర్ లోని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ కు పూలగుచ్చం అందజేసి స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవిత్రంగా నలపై రోజుల పాటు ఉపవాస దీక్షలతో ఉంటూ రంజాన్ మాసం ను పూర్తిచేసుకోవడం విశేషం అని ఆయన అన్నారు. అనంతరం ముస్లీం మత పెద్దలకు, కార్యకర్తలకు, నాయకులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరునార్తి రమణ, బొజ్జ పవన్, తాజా మాజీ మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్, తాజా మాజీ కౌన్సిలర్ లు దొంతి లక్ష్మి ముత్యం గౌడ్, దాయర రాజలింగం, బట్టి జగపతి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హపీజ్ మోల్సాబ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ మేడి మధుసూదన్ రావు, సమీ, లక్ష్మినారాయణ గౌడ్, దుర్గప్రసాద్, నిఖిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమర్, తాహేర్, అంజద్, మైసన్, రిజ్వాన్, బాని, డిజె రితీష్, మున్నా, శివరామక్రిష్ణ, శ్రీను లతో పాటు ముస్లీం మత పెద్దలు తదితరులు పాల్గోన్నారు.









