హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 31.
పాపన్నపేట మండలంలోని
దౌలపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు శ్రీకాంత్ రెడ్డి తండ్రి డాక్టర్. రాజా శ్రీధర్ రెడ్డి ఆదివారం మరణించడం జరిగింది. ఈ విషయం నాయకుల ద్వారా తెలుసుకున్న మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి గారు, తాజా మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారు సోమవారం దౌలపూర్ గ్రామానికి చేరుకొని శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించారు. రాజా శ్రీధర్ రెడ్డి చనిపోవడం చాలా బాధాకరమన్నారు. శ్రీకాంత్ రెడ్డి కి మనోధర్యాన్ని తెలిపారు. అదేవిధంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన పిఎసిఎస్ చైర్మన్ త్యార్ల. రమేష్ గారి సతీమణి త్యార్ల. సుజాత ప్రమాదవశాత్తు నిన్న మరణించడం జరిగింది, త్యార్ల. రమేష్ గారిని పరమర్శించారు. వారికి మనో ధైర్యాన్ని తెలిపారు. వీరి వెంట మాజీ మండల రైతుబంధు అధ్యక్షులు. గడీల శ్రీనివాసరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు జగన్, మాజీ సర్పంచ్ లు ఆంజనేయులు, గురుమూర్తి గౌడ్. లింగారెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,నవీన్ గౌడ్, శ్రీనాథ్ రావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వడ్ల.కుబేర్, నాయకులు సొంగ. దుర్గయ్య,చావా బాపారావు, కొత్త వెంకటేశం, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్, మెదక్ పట్టణ కన్వీనర్ తాజా మాజీ కౌన్సిలర్ మామిళ్ళ.ఆంజనేయులు, మరియు కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.









