+91 95819 05907

కార్పొరేట్ సంస్థల దాహం తీర్చేందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం

హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో కార్పొరేట్ సంస్థల దాహం తీర్చేందుకే HCU భూముల వేలం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని పి డి యస్ యూ ఇల్లందు డివిజన్ కార్యదర్శి బానోత్ నరేందర్ అన్నారు.సోమవారం చండ్ర కృష్ణమూర్తి ట్రస్ట్ భవన్ లో పి డి యస్ యూ ముఖ్యుల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పుతోందని తక్షణమే హెచ్ సి యూ భూముల వేలం వేయడాన్ని విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తమ భావప్రకటన, స్వేచ్ఛ ను ప్రకటించుకునే హక్కు లేకుండా గొంతు నొక్కుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదివారం విశ్వవిద్యాలయంలోకి పోలీసులను పంపించి జేసిబి లతో భూమిని కబ్జా చేస్తుంటే అడ్డుకునేందుకు వెళ్లిన విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తించడం దాడి చేయడం జరిగిందని ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులపై లేడీ కానిస్టేబుల్ లేకుండానే వాళ్లను బ్రాండ్లలో చూసి అసభ్యకరంగా పోలీసులు ప్రవర్తించారని అన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న పి డి యస్ యూ హెచ్ సి యూ అధ్యక్షుడు నాగరాజు ను స్టూడెంట్ యూనియన్ నాయకులను,ఇతర విద్యార్థి సంఘాల నాయకులను, విశ్వవిద్యాలయ విద్యార్థులను అరెస్టు చేస్తే మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం హెయమైనా చర్య అని ఈ ఘటనను పి డి యస్ యూ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్ సి యూ భూముల కబ్జాను వెంటనే ఆపి వెనక్కి వెళ్లాలని లేనిపక్షంలో విద్యార్థులు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పి డి యస్ యూ ఇల్లందు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బి.సాయి,ఎ.పార్థసారథి, గంగాధర గణేష్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !