-ఎమ్మెల్యే జారే చొరవతో సీసీ రోడ్ మంజూరు
-ఫలించిన స్థానిక నాయుడు కొల్లు చంద్రం కృషి, గ్రామస్తులు హర్షం…
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 31: ప్రజా సేవ చేయాలనే తపన, చేయించాలనే ఉత్సాహం ఉండాలే ఎలాంటి పని అయినా చిటికెలో జరిగిపోతుంది. మండల పరిధిలోని అచ్యుతాపురం ఏజెన్సీ పంచాయితి లో తట్టు కోళ్ళ నాగేశ్వరరావు ఇంటి నుండి పెద్ద నూతి చలక మీదుగా వేజల్ల మురళి ఇంటి వరకు ఏళ్ళ తరబడి అపరిష్కృతంగా ఉన్న అంతర్గత వీధి సమస్యకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. దాదాపు 60 ఏండ్లు ఉనికి గల ఈ పెద్ద నూతి చలక వీధికి ఎన్నో ఏండ్లుగా పంచాయితీ రోడ్ గా తీర్చిదిద్దాలని గత కాలం పాలక వర్గాలు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. గత అయిదేళ్లు పంచాయితీ సర్పంచ్ గా ఉన్న నాగలక్ష్మి భర్త కొల్లు చంద్రం గతంలో ఎమ్మెల్యే లకు, నేడున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు గ్రామం తరుపున ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రం అందజేసారు. ప్రస్తుతం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పదించడంతో ఏండ్లు నాటి అంతర్గత దారి సమస్య పరిష్కారానికి నోచుకుంది. 120 మీటర్లు మేర గ్రామీణ ఉపాధి హామీ నిధులను కేటాయించి, రూ.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్ ను నిర్మించనున్నారు. ఈ మేరకు సోమవారం ఆ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వీధిని సిద్ధం చేసారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అచ్యుతాపురం శాఖ అధ్యక్షులు కొల్లు చంద్రశేఖర్, సీనియర్ నాయకులు జూపల్లి వెంకటేశ్వరావు, కొనకళ్ళ చెన్నారావు యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు నాగేంద్ర, తట్టుకోళ్ల సతీష్, కొనకళ్ళ శేఖర్, వంశీ, కామేష్, కిషోర్, రంగారావు, వెంకన్న బాబు ప్రభు యూత్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.