+91 95819 05907

ఏళ్ళు నాటి సమస్యకు పరిష్కారం

-ఎమ్మెల్యే జారే చొరవతో సీసీ రోడ్ మంజూరు
-ఫలించిన స్థానిక నాయుడు కొల్లు చంద్రం కృషి, గ్రామస్తులు హర్షం…

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 31: ప్రజా సేవ చేయాలనే తపన, చేయించాలనే ఉత్సాహం ఉండాలే ఎలాంటి పని అయినా చిటికెలో జరిగిపోతుంది. మండల పరిధిలోని అచ్యుతాపురం ఏజెన్సీ పంచాయితి లో తట్టు కోళ్ళ నాగేశ్వరరావు ఇంటి నుండి పెద్ద నూతి చలక మీదుగా వేజల్ల మురళి ఇంటి వరకు ఏళ్ళ తరబడి అపరిష్కృతంగా ఉన్న అంతర్గత వీధి సమస్యకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. దాదాపు 60 ఏండ్లు ఉనికి గల ఈ పెద్ద నూతి చలక వీధికి ఎన్నో ఏండ్లుగా పంచాయితీ రోడ్ గా తీర్చిదిద్దాలని గత కాలం పాలక వర్గాలు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. గత అయిదేళ్లు పంచాయితీ సర్పంచ్ గా ఉన్న నాగలక్ష్మి భర్త కొల్లు చంద్రం గతంలో ఎమ్మెల్యే లకు, నేడున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు గ్రామం తరుపున ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రం అందజేసారు. ప్రస్తుతం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పదించడంతో ఏండ్లు నాటి అంతర్గత దారి సమస్య పరిష్కారానికి నోచుకుంది. 120 మీటర్లు మేర గ్రామీణ ఉపాధి హామీ నిధులను కేటాయించి, రూ.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్ ను నిర్మించనున్నారు. ఈ మేరకు సోమవారం ఆ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వీధిని సిద్ధం చేసారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అచ్యుతాపురం శాఖ అధ్యక్షులు కొల్లు చంద్రశేఖర్, సీనియర్ నాయకులు జూపల్లి వెంకటేశ్వరావు, కొనకళ్ళ చెన్నారావు యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు నాగేంద్ర, తట్టుకోళ్ల సతీష్, కొనకళ్ళ శేఖర్, వంశీ, కామేష్, కిషోర్, రంగారావు, వెంకన్న బాబు ప్రభు యూత్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు.

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు. లొంగిపోయిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46

Read More »

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం

Read More »

ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుడిగాలి పర్యటన!

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే

Read More »

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

 Don't Miss this News !