+91 95819 05907

రామాయంపేటలో ఈనెల 25న ఆవాస విద్యాలయంలో ప్రవేశ పరీక్ష

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 10:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని మెదక్ రోడ్ లో ఉన్న స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో 3వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఉచిత విద్య, ఉచిత హాస్టల్ సౌకర్యం, ప్రైవేట్ పాఠశాలలో మరియు ప్రైవేట్ కళాశాలలో చదివిపిస్తూ.సేవాభారతి దేశం మొత్తములో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.చిన్న వయస్సులోనే విద్యార్థులకు చదువు, సంస్కారం మరియు సత్పవర్తన వారి హృదయాలలో నింపి ఉత్తమ పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశ్యంతో స్వామి వివేకానంద అవాస విద్యాలయాన్ని 2006లో ప్రారంభించడం జరిగిందని ఆవాస విద్యాలయ ప్రధాన ఆచార్యులు తెలిపారు.అదేవిధంగా చక్కటి వసతి, భోజనం కల్పిస్తూ ఆటపాటలలో మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో శిక్షణ అందిస్తుందని పేర్కొన్నారు.2025-2026 విద్యా సంవత్సరం గాను ప్రవేశ పరీక్ష మే 25, 2025 ఆదివారం రోజున ఉదయం 11-30 గంటల నుండి 2 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ప్రవేశ పరీక్షకు 3,4,5,6,7 తరగతుల విద్యార్థులు తెలుగు/మీడియం మరియు ఇంగ్లీష్/మీడియం నందు ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు.ప్రవేశ పరీక్షకు వచ్చే విద్యార్థులు ప్యాడ్, ఆధార్ కార్డు జిరాక్స్, ఒక పాస్ పోర్టు సైడ్ ఫోటో తీసుకొనిరాగలరు.ఎంపిక అయిన విద్యార్థులకు ఉచిత హాస్టల్ మరియు ప్రైవేటు పాఠశాలలో చదివిస్తామని పేర్కొన్నారు.ఎంపికైన విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ప్రతి రోజు ఉదయం,సాయంత్రం ఆవాసంలో ట్యూషన్ క్లాసులు,స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించబడతాయని పేర్కొన్నారు.దేశ శ్రేయస్సును కోరే ప్రతీ ఒక్కరు తల్లిదండ్రులు లేని పిల్లలను,తల్లి ఉండి తండ్రిలేక అలాగే తండ్రి ఉండి తల్లిలేని పిల్లలకు మరియు తల్లిదండ్రులు ఇద్దరు ఉండి కూడా బీదరికంలో ఉండే పిల్లలను ఆవాస విద్యాలయములో చేర్పిస్తే వారికి మంచి భవిష్యత్తును అందిస్తుందని తెలిపారు.చదువుకోవాలనే సంకల్పం ఉన్న ఆసక్తిగల విద్యార్థులు మిగతా వివరాల కోసం ఫోన్ 7386660483, 9989518920 నెంబర్లకు సంప్రదించవచ్చని వారు తెలియపరచారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు.

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు. లొంగిపోయిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46

Read More »

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం

Read More »

ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుడిగాలి పర్యటన!

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే

Read More »

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

 Don't Miss this News !