నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
ఖమ్మం నగరంలోని త్రీటౌన్ ప్రాంతంలో గల వ్యవసాయ మార్కెట్ వద్ద మరియు 33 వ డివిజన్ గాంధీ నగర్ లో స్వర్గీయ శ్రీ మువ్వల తులసి దాస్ జ్ఞాపకార్థం దేవకీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది . దానితోపాటు మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరిగింది . మువ్వల తులసీదాసు గతంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పేద ప్రజల సమస్యలను తీర్చడంలో మరియు ఆర్యవైశ్య సంఘంలో కూడా ప్రముఖ పాత్రను పోషిస్తూ వ్యాపార సంఘంలో ఉన్నటువంటి సమస్యలను తీరుస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో వారి యొక్క పాత్రను పోషించడం జరిగింది . వారి యొక్క అకాల మరణం ఆర్యవైశ్యులను మరియు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలను కలచివేసింది . వారి యొక్క జ్ఞాపకాలను ఖమ్మం జిల్లా ప్రజలు ఇంకా మరిచిపోలేదు . వారి యొక్క సేవ గుణాన్ని అదేవిధంగా కొనసాగేలా వారి యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ వేసవికాలంలో ప్రజలకు ఎంతో కొంత సహాయం జరగాలని తీవ్రంగా ఉన్నటువంటి ఎండల నుండి ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రాలను దేవకి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దేవకీ వాసుదేవరావు దంపతులు ఏర్పాటు చేయడం జరిగింది . దేవకి ఫౌండేషన్ అధినేత శ్రీ దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ మువ్వల తులసీదాసు అకాల మరణం వ్యాపార వర్గాలలో మరియు ఖమ్మం జిల్లాలో ఒక దురదృష్టకరమైన సంఘటన అని తెలియజేయడం జరిగింది . ఆ రోజు నుండి వారికి తోచిన విధంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పేద ప్రజలకు పుస్తకాల పంపిణీ మరియు గతంలో ఖమ్మంలో మున్నేరు వరదలు సంభవించినప్పుడు తమ వంతుగా అనేక నిత్యావసర వస్తువులు మరియు దుప్పట్ల పంపిణీ దేవకి ఫౌండేషన్ ద్వారా అందచేయడం జరిగింది . అంతేకాకుండా వారు మున్ముందు రాబోయే రోజుల్లో కూడా వారి వంతుగా అనేక సేవా కార్యక్రమాలను ప్రజల కొరకు చేస్తానని తెలియజేయడం జరిగింది . ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి వారి యొక్క మిత్రబృందం మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు వారు ఇదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని వారికి భగవంతుడు అందుకు కావాల్సిన ఆర్థిక శక్తిని మరియు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ వారు మున్ముందు అనేక సేవా కార్యక్రమాలను చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది .









