నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
ఖమ్మం లో తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు కలిసి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలోని మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందించారు . తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2000 మంది మీటర్ రీడింగ్ కార్మికులు పనిచేస్తున్నారని , ప్రభుత్వ సంస్థ అయిన విద్యుత్ సంస్థల్లో దాదాపు 23 సంవత్సరాల నుండి మీటర్ రీడింగ్ తీసే పనిని చేస్తూ సంస్థకు ఆదాయాన్ని సమకూరుస్తూ , అత్యంత ముఖ్యమైన విధులు నిర్వహించడం జరుగుతుందని , సంవత్సరాలుగా సదరు సంస్థలు మా సేవలను వినియోగించుకుంటున్నాయి కానీ మాకు తగిన న్యాయం చేయడం లేదని , తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు బాగుపడతాయని , తెలంగాణా రాష్ట్రం కోసం అన్ని సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రకాల ఉద్యమాల్లో పాల్గొనడం జరిగిందని , గత ముఖ్యమంత్రి కి ఎన్నిసార్లు విన్నవించినా మా సమస్యలను ఏ మాత్రం ఖాతరు చేయలేదని , తెలంగాణా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తూ బంగారు తెలంగాణాను సాధించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని , కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండి ఎంఎల్సీగా ఉన్న తమరు మా యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని భావిస్తున్నామని అన్నారు . పీసురేటు విధానం రద్దు చేయాలి , నెలవారీ పని దినాలు కల్పించి కనీస వేతనాలు ఇవ్వాలి , ఈపీఎఫ్ , ఈఎస్ఐ లతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి మా 2000 కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో టిజిఎన్ పి డి సి ఎల్ అధ్యక్షులు వెలిచేటి రాజా , రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి వీరయ్య , నాగేశ్వరావు , అనిల్ , మల్లేశ్వరరావు , వంశీ , నాగార్జున , బాలు , నరేష్ , నవీన్ , మధు తదితరులు పాల్గొన్నారు .









