నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం వీడియోస్ కాలనీ శ్రీ సాయిబాబా ధ్యాన మందిరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు . ఉదయం 40 మందితో సాధన , సాయంత్రం గురుపూజ , కేక్ కటింగ్ , సత్సంగ్ అనంతరం ప్రసాదాల వితరణ జరిగింది . ఈ సందర్భంగా నిర్వాకులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 184 దేశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా యోగ మరియు ధ్యానం ని ప్రజలకు అందిస్తున్నారని , మన భారత దేశంలో వ్యక్తి వికాస కేంద్ర ద్వారా సుమారు లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తూ… మన దేశంలో 60 నదులను పునరుద్ధరణ చేశారు . అలాగే కోటి మొక్కలను ఈ సంస్థ ద్వారా నాటారని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల , ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ కో ఆర్డినేటర్ వెంకట్ , శ్రీనివాస్ రెడ్డి , వెంకట్ రెడ్డి , గోపాల్ రావు , లక్ష్మణ్ , సత్యవతి , హరిబాబు , బద్రి నారాయణ పాల్గొన్నారు .









