మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి అంటే స్కిల్స్ అవసరం –
మామిడాల శివ కుమార్.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు
ఖమ్మం నగరంలోని సమర్థనం దివ్యంగుల సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైన మూడు నెలల ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని విద్యావేత్త డా. మామిడాల శివ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా శివ కుమార్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి అంటే స్కిల్స్ అవసరం అని కంప్యూటర్ శిక్షణతో ఉద్యోగాలలో రాణించ వచ్చని అన్నారు. కంప్యూటర్ స్కిల్స్ ఉంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మహిళలకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న నిర్వాహకులను మరియు సమర్థనం దివ్యంగుల సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఈ సందర్భంగా సమర్థనం రాష్ట్ర కో ఆర్డినేటర్ నలుపు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధి ద్యేయంగా శిక్షణ కొనసాగుతుందని సృజనాత్మకత పెరుగుతుందని అన్నారు. 25 మంది మహిళలకు మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కోర్సులో చేరిన వారికి బ్యాగ్, మెటీరియల్, నోట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో వర్సటైల్ ఐటీ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోడిరెక్క ఉమా శంకర్, కమ్యూనికేషన్ స్కిల్స్ బోధకులు రచ్చ సతీష్ మోహన్, ట్రైనర్ కల్లెపు అఖిల తదితరులు పాల్గొన్నారు.









