*విద్యార్థిని అదృశ్యం పై కేసు నమోదు*
అశ్వాపురం:
మండల పరిధిలోని పాములపల్లి గ్రామానికి చెందిన పోడుతూరి కన్నయ్య కుమార్తె పోడుతూరి పూజ శ్రీ (19) భద్రాచలంలో సిద్ధార్థ ఒకేషనల్ కాలేజీలో చదువుతోంది. ఈనెల ఐదున కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. విద్యార్థిని కోసం బంధువులు కుటుంబ సభ్యుల ఇండ్లలో వెతికిన ఎక్కడ ఆచూకీ దొరకకపోవడంతో మంగళవారం అశ్వాపురం పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మధు ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 304









