తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ వి.బాబు
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
తెలంగాణ జన సమితి ఖమ్మం జిల్లా కమిటీ సమావేశం మయూరి సెంటర్ లో నిర్వహించడం జరిగింది .ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి ఖమ్మం జిల్లా కన్వీనర్ వి.బాబు మాట్లాడుతూ తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు , ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో పార్టీ అభివృద్ధి కోసం త్వరలో పూర్తిస్థాయి కమిటీ వేసి పార్టీ నిర్మాణం కోసం కార్యకర్తలు అందరూ విస్తృతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు . అలాగే సింధూర ఆపరేషన్ , దేశంలో కగార్ ఆపరేషన్ యుద్ధం చేస్తున్నారు . సింధూర ఆపరేషన్ పేరుతోటి దేశ రక్షణ కోసం చేస్తున్న యుద్ధం పరిష్కారం కావాలని అన్నారు . కగార్ ఆపరేషన్ ఆపేసి మావోయిస్టుల తోటి చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు . పాకిస్తాన్ యుద్ధంలో మరణించిన మురళి నాయక్ కు సంతాపం తెలియజేశారు . వారి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు . ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జంగిపల్లి రవి , ఎల్ నరసింహారావు , వి మోహన్ , బి.రాజేందర్ , బి.నాగేశ్వరరావు , వై.నాగేశ్వరరావు , డి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు .









