ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి
– మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ
– మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరున లేఖ విడుదల
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: బాజాప హిందుత్వ ఫాసిస్ట్ కహార్ దాడిని ఖండిస్తూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఈనెల 20న మావోయిస్టు పార్టీ తలపెట్టిన బందును విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరున విలేకరులకు లేఖను విడుదల చేశారు. కేంద్రంలో భాజపా హిందుత్వ పార్టీ 2026 నాటికి మావోయిస్టు పార్టీ ని లేకుండా చేస్తానని ప్రకటించి… 2024 లో కకార్ ఆపరేషన్ ప్రకటించి దాదాపుగా 557 పైగా హత్యలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడింది అని అన్నారు. పోరు బాటలో 40 సంవత్సరాల ఉద్యమం అనుభవం ఉన్న విలువైన కామ్రేడ్స్ కోల్పోయామని ఆవేదన వెలబుచ్చారు. తక్షణమే ఆపరేషన్ కగార్ ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలు తమ బందుకు పూర్తి మద్దతు తెలిపాలని మావోయిస్టు పార్టీ కోరింది.









