పినపాక
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజా వేదిక రేపు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేస్తున్నామని ఎంపీడీవో సునీల్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈజీఎస్ సిబ్బంది పూర్తి సమాచారంతో ఈ ప్రజా వేదికకు హాజరుకావాలని తెలిపారు. 16వ విడత సామాజిక తనిఖీ 01/04/2024 నుండి 31/03/2025 వరకు మండలంలోని నిర్వహించిన ఉపాధి హామీ పనులపై నిర్వహించిన సామాజిక దానికి బృందాల తుది నివేదిక సమాచారం ఇక్కడ తెలియజేస్తామని తెలిపారు.
Post Views: 83









