+91 95819 05907

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం -భద్రాద్రి జిల్లా పర్యటనలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారె

ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి, ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నేతలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 17: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయనకు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తోడుగా ఉన్నారు. ముందుగా, మంత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి జెండా వందనం చేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి మండలం మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్‌లో పాల్గొన్నారు. అదేవిధంగా, మూకమామిడి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో కొత్తగా నిర్మించనున్న కాంపౌండ్ వాల్, స్టాఫ్ రూమ్స్, బాయ్స్ హాస్టల్, అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. అడ్వాంటా కంపెనీ వారు అందించిన కంప్యూటర్ ల్యాబ్, మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించి, కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు. పట్వారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టేబుల్ టెన్నిస్ యూనిట్‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా అంగన్‌వాడీ టీచర్లకు కొత్త వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమాలలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో బి. రాహుల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా వైద్యాధికారిణి జయలక్ష్మి, జిల్లా పరిపాలన అధికారి విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీసీహెచ్ఓ రఘుబాబు, డీఏఓ బాబురావు, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వాసం రాణి, సొసైటీ చైర్మన్ యెల్లిన రాఘవరావు, మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు, ఇతర జిల్లా స్థాయి అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !