నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండలం నాగిలికొండ గ్రామంలో గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు పగడాల రాజు ఇంట్లో కాఫీ తాగిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క.ఈ సందర్భంగా కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు.సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పారు.మహిళలకు ఉచిత బస్సు, సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సబ్సిడీ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరా మహిళా డైరీ వంటివి నిరుపేదలకు ఒక వరంగా నిలిచాయని ప్రజలందరూ ముకుమ్మడిగా చెప్పారు.సంక్షేమ ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు అందించడమే ప్రజా ప్రభుత్వం ముఖ్య లక్ష్యం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ సందర్భంగా స్పష్టం చేశారు.









