నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) సెప్టెంబర్ 17.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినం భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద బిజెపి మండల పార్టీ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నేటి నుండి 15 రోజులపాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరవీరుల త్యాగం మరువలేనిదని ఈ సందర్భంగా వారు అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మసాయిపేట అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ,
మాజీఅధ్యక్షుడువేణుగోపాల్ , ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ ఉపాధ్యక్షులు పాపన్నగారి శ్రీకాంత్ , శివకుమార్ గౌడ్ , గబ్బుల కోటేష్ శక్తి కేంద్రం రామునాయక్ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు ఆకారం బాబు , కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు తలారి మల్లేష్ , యువ మోర్చా మండల అధ్యక్షుడు గోగోండ విట్టల్ ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి దేవునూరి సాయి కుమార్ ,
బూతు అధ్యక్షులు సాయి , నరేందర్ , కుమార్ యాదవ్, సత్యనారాయణ , రవి ,శ్రీనివాస్ నాయక్ , రాజు సురేష్ , సీనియర్ నాయకులు ముక్కా యాదగిరి, ఉప్పల ప్రశాంత్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.









