నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి:
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో పంట పొలాలను పరిశీలించిన మధిర వ్యవసాయ సంచాలకుల ఎస్ విజయ్ చంద్రం. ఈ సందర్భంగా విజయ్ చంద్రం చింతకాని పాతర్లపాడు గ్రామంలో సేంద్రీయ పద్ధతిలో పండించే పంటలను పరిశీలించి. సేంద్రియ వ్యవసాయం వల్ల అ దిగక దిగుబడి పొందవచ్చు అని వ్యవసాయ శాఖ అధికారి అన్నారు. తదనంతరం శ్రీనివాసరావు వరి పంటను పరిశీలించి.మాట్లాడుతూ సేంద్రియ పద్ధతిలో రైతులు పంటలు పండించడం వలన. పర్యావరణానికి హానికరం లేకుండా ఉంటుందని మరియు తక్కువ ఖర్చు అధిక దిగబడి పొందవచ్చు అని. సేంద్రియ వ్యవసాయంపై రైతులు ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించినారు. ఈ కార్యక్రమంలో చింతకాని మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మానస. వ్యవసాయ విస్తరణ అధికారి తేజ. మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 133









