ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ బాబురావుకు జ్ఞాపకం అందజేస్తున్న ప్రముఖులు
నేటి గదర్ న్యూస్, కొణిజర్ల:-
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ ఎంపీ బాబురావుకు ప్రముఖులు జ్ఞాపకను గురువారం బహూకరించారు.ఇటీవల కొద్ది కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో డే స్ప్రేయింగ్ ఇంటర్నేషనల్ అమెరికా,ఇండియా సంయుక్త యూనివర్సిటీల ఆధ్వర్యంలో జర్నలిస్టు బాబురావుకు డాక్టరేట్ పట్టా అరుదైన గౌరవాన్ని అందుకున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా వారికి అంబేద్కర్ జాతీయ సేవా రత్న అవార్డు కూడా రావటంతో రాష్ట్ర,జిల్లా ప్రముఖులు ముడుసు జాకోబు ప్రతాప్,కామల్ల కనకరత్నం,కొర్లపాటి చిరంజీవి,సీనియర్ జర్నలిస్టు ఉల్లోజు రమేష్ లుబాబురావుని మర్యాదపూర్వకంగా కలుసుకొని దుస్సాలువాతో సన్మానించి అనంతరం జ్ఞాపకం బహుకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టుగా బాబురావు పత్రిక రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారని,అదేవిధంగా సమాజంలో కూడా తమకున్న శక్తి మేర పలు సేవా కార్యక్రమాలు చేపట్టారని గుర్తించినటువంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు వారికి డాక్టరేట్ బహూకరించటం అంబేద్కర్ జాతి అవార్డు రావడం తమకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.వారు చేసినటువంటి సేవలు వారి జీవితానికి సంబంధించినటువంటి నాటి నుంచి నేటి వరకు వార్త కథనాన్ని ప్రచురించి వారికి జ్ఞాపక రూపంలో అందజేయడం జరిగిందని వారు తెలియజేశారు.వారికి ప్రత్యేక కథనాన్ని రాసి అందించినటువంటి జర్నలిస్టు ఉల్లోజు రమేష్ ను వారు అభినందించారు.రానున్న కాలంలో వారు మరిన్ని ప్రశంసలు అందుకోవాలని ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.వారితోపాటు ప్రముఖులు కొట్టే నాగేంద్రబాబు నవీన్ బాబు స్వరూప రాణి తదితర ప్రముఖులు ఉన్నారు.









