నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి.
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండల కేంద్రానికి చెందిన కొమ్ము ముత్తయ్య కూతురు ఆద్వితా నందనకు నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో అత్యవసర శస్త్ర చికిత్స కోసం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసుతో ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎంఆర్ఎఫ్) నుంచి రూ. 2లక్షలకు ఎల్ ఓ సీ పత్రం మంజూరైంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లోని తన నివాసం వద్ద బాధిత కుటుంబానికి.. ఎంపీ రామసహాయం అందజేశారు. ఇటీవల బాలిక తల్లిదండ్రులు ఎంపీని కలిసి..క్రానియల్ రీమోడలింగ్ ఆపరేషన్ చేయించాల్సి ఉందని, ఆర్థిక తోడ్పాటు అందించాల్సిందిగా విన్నవించగా వెంటనే స్పందించి ఈ మేరకు మంజూరు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెదడు ఎదుగుదలకు అనుకూలంగా తల ఆకృతి మార్పు కోసం జరిగే ఈ శస్త్ర చికిత్స విజయవంతం కావాలని, ఆ చిన్నారి పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని.. ఆకాంక్షించారు.









