+91 95819 05907

శ్మశాన వాటికకు రహదారి ఏర్పాటు చేసేవరకు సిపిఐ(ఎం) పోరాడుతుంది

శ్మశానానికి రహదారి లేక నరకం చూస్తున్న పేద ప్రజలు

అధికారం అండతో పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్న కబ్జాదారులు

కబ్జాదారుల కొమ్ము కాస్తున్న పాలకులు

పేద ప్రజలు ఇబ్బందులను పట్టించుకోని అధికారులు

సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు.

నేటి గదర్ న్యూస్, వైరా:-
వైరా మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ బజార్ శ్మశాన వాటికకు రహదారి లేక పేద ప్రజలు నరకం అనుభవిస్తున్నారని, పేద కుటుంబంలో మరణం సంభవిస్తే బంధువులు చందాలు వేసుకొని దహన సంస్కారాలు చేయాల్సిన దుస్థితిలో హనుమాన్ బజార్ పేద ప్రజలు బ్రతుకుతున్నారని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. శనివారం సిపిఐ(ఎం) వైరా శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ బజార్ స్మశాన వాటికకు బౌండరీలు ఏర్పాటు చేసి శాశ్వతంగా రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు వైరా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం మున్సిపాలిటీ కమిషనర్ గురులింగంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ హనుమాన్ బజార్ స్మశాన వాటికకు రహదారి లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎవరికైనా మరణిస్తే స్మశాన వాటికకు వెళ్ళటానికి రహదారి లేక ముండ్ల కంప చెట్లను తొలగించడానికి జేఏసీ వాడాల్సి వస్తుందని, పేద కుటుంబంలో మరణం సంభవిస్తే చందాలు వేసుకొని దహన సంస్కారాలు చేయాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట మరణం సంభవిస్తే దహనం చేయడానికి మోకాళ్ళ లోతు బురద, ముళ్ళ కంపతో కుటుంబ సభ్యులు నరకం చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల కష్టాలు పాలకులకు పెట్టడం లేదని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కబ్జాదారులు పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పాలకులు, అధికారులు కబ్జాదారుల కొమ్ముకాస్తున్నారని, రెవిన్యూ అధికారులు గతంలోనే సర్వే చేసి బౌండరీలు ఏర్పాటు చేసినా మున్సిపాలిటీ అదికారులు శాశ్వతంగా హద్దులు నిర్ణయించి రహదారి ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే మున్సిపాలిటీ అధికారులు స్పందించి
స్మశాన వాటికకు హద్దులు నిర్ణయించి శాశ్వత రహదారి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హనుమాన్ బజార్ స్మశాన వాటిక సమస్య పరిష్కారం అయ్యేంతవరకు సిపిఎం పోరాడుతుందని తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ కమీషనర్ గురులింగం స్పందిస్తూ శ్మశాన వాటికను సందర్శించి సమస్యను పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, నాయకులు గుడిమెట్ల రజిత, పైడిపల్లి సాంబశివరావు, గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, బాజోజు రమణ, వైరా శాఖ కార్యదర్శి ఓర్సు సీతారాములు, మాడపాటి వెంకటేశ్వరరావు, అమరనేని కృష్ణ, నుకల వేంకటేశ్వరరావు, వల్లేపు కొండలు, దేవళ్ళ క్రిష్ణ, వల్లేపు రాము, దుగ్గిరాల సామేలు, దుగ్గిరాల జాకోబ్, దుగ్గిరాల బాలస్వామి, బత్తుల ప్రమీల, భూక్యా విజయ, మాడపాటి సుజాత, దేవళ్ళ మంగ, మాడపాటి రామారావు, దండిగిరి వెంకటేష్, వేముల గోపి, ఉప్పు రాజేశ్వరి, వేముల భూలక్మీ, సైదమ్మ, భైరవ వెంకటేశ్వర్లు, కిన్నెర మోతి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !