నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ)సెప్టెంబర్ 20.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల్ కాళ్ళకల్ గ్రామం నుండి ముప్పిరెడ్డిపల్లి వెళ్లే పారిశ్రామిక వాడకు వెళ్లే రోడ్డులో వెళ్లే పాదాచారులకు కొన్ని రోజులుగా వర్షాలు పడడంతో రోడ్డు గుంతల మయం కావడంతో పరిశ్రమలకు వెళ్లే వారికి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయని పాదాచారులు ఆవేదన చెందుతున్నారు భారీ వాహనాలు రోడ్డు పక్కన నిల్పడంతో ద్విచక్ర వాహనాదారులకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నట్లు తెలిపారు రాత్రి సమయంలో చీకట్లో గుంతలు కనబడక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు దీనిపై టిఎస్ఐఐసి వారు మరియు అధికారులు స్పందించి రోడ్డు బాగు చేయగలరని కోరుచున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 33









