*
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ ) సెప్టెంబర్20
మెదక్ జిల్లామాసాయిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం అభివృద్ధి పనులు పారిశుద్ధ్యం, బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఏర్పాట్లు,
గ్రామాల్లో నెలకొన్న సమస్యలు వంటి వాటిపైసంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సునీత రెడ్డి సమీక్ష
జరిపారు ఈ సందర్భంగా గ్రామపంచాయతీలో
నిధులు లేకున్నా తమ సొంత డబ్బులు వెచ్చించిపారిశుద్ధ్యం, నిర్వహణ, మంచినీటి సరఫరా తడి
పొడి చెత్త సేకరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్యేకు
వివరించారు. అదేవిధంగా ఇటీవల కురిసిన భారీవర్షాలకు దెబ్బతిన్న పంటలు వివరాలు, ఇల్లు
వివరాలను వివరించారు. పలు గ్రామాల్లో ప్రభుత్వపాఠశాలలు అంగన్వాడీ భవనాలు శిథిలావస్థకు
చేరుకున్నాయని నూతన బిల్డింగ్లకు నిధులుమంజూరు అయ్యేలా చూడాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. రామంతాపూర్ తండాలో రెండు వాటర్
ట్యాంకులకు మంజీరా నీటి సరఫరా రావడం లేదని,గ్రామపంచాయతీ, అంగన్వాడి కేంద్రం భవనాలకు
నిధులు మంజూరైన పనులు ప్రారంభించకపోవడం
తో ఇబ్బందులు అవుతున్నాయని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులపై పని భారం ఎక్కువ అయిందని,గుర్తింపు ఉండడం లేదని పంచాయతీ కార్యదర్శులు
వాపోయారు. నిధులు లేక తమ సొంత డబ్బులువెచ్చించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయనితెలిపారు. పక్క రాష్ట్రాల్లో పంచాయతీ కార్యదర్శులకు
మంచి గుర్తింపు ఉందని కానీ తెలంగాణలో మాత్రంకిందిస్థాయి వర్కర్లుగా చూస్తున్నారని ఈ పద్ధతిని
మార్చేలా ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలనుతీసుకెళ్లాలని కోరారు. సమీక్ష నిర్వహించిన అనంతరం పలు గ్రామాలకు చెందిన ప్రజలు సమస్యలపైఎమ్మెల్యేకు వినతిపత్రం అందచేశారు.









