నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
గత కొన్ని నెలల కాలం నుండి చిన్నమండవ మున్నేరు
పారివాహ ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు ఇసుక ట్రాక్టర్ల వద్ద నుండి అక్రమంగా వసూలు చేసే విషయాన్ని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు కలెక్టర్ దృష్టికి ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఇట్టి విషయంపై ఖమ్మం ఆర్డీవో ముదిగొండ తాసిల్దార్ చింతకాని తహసిల్దార్ వైరా సీఐ గ్రామస్తులు సమక్షంలో విచారణ నిర్వహించారు.
దౌర్జన్యంగా అక్రమంగా ఇందిరమ్మ పనులు లబ్ధిదారుల నుంచి మోసపూరితంగా ఇసుక ట్రాక్టర్ల వద్ద నుండి వసూలు చేసే లంకాధిపతులపై చట్టరితే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులు కోరారు మరియు నష్ట నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..
Post Views: 117









