నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
చింతకాని మండలం
చిన్నమండవ గ్రామంలో గత 5నెలల కాలం ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి ట్రాక్టర్ వేయి రూపాయల వసూలు చేస్తున్న విషయం తెలిసిందే, స్థానికులు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు మేరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిన్నమండవ మునేరు ప్రాంతాన్ని పరిశీలించినారు.పట్టా పాస్ బుక్కులు కలిగిన వ్యక్తులు ప్రభుత్వం అనుమతి లేకుండా ఇసుక ర్యాంపు ఏర్పాటుచేసిరు… అట్టి రాంపులను జెసిబి తో తొలగించడం జరిగింది… ప్రభుత్వ అనుమతితో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచిత ఇసుక వచ్చేలా కలెక్టర్ గారికి నివేదిక ఇస్తామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తెలియజేశారు…. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని. గ్రామస్తులు తెలిపారు…ఈ కార్యక్రమంలో ముదిగొండ చింతకాని ఎమ్మార్వో బాబ్జి ప్రసాద్, ఎలిశబెత్ రాణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏకకర్ణ, జగదీష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు…









