నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంము మరియు జగనాథపురం, కోడుమూరు సబ్ సెంటర్లో యూరియా పంపిణీ విధానాన్ని పరిశీలించిన మధిర వ్యవసాయ సంచాలకులు ఎస్ విజయచంద్రం,ఈ సందర్భంగా విజయ్ చంద్రం మాట్లాడుతూ. రైతులు తగిన మాతాధిలో మాత్రమే యూరియా వాడుకోవాలని మోతాదుకు మించి వాడటం వలన అధిక తెగుళ్లు, చీడపిడుగులు పంటకు వస్తుందని సూచించినారు. యాసంగికి మొక్కజొన్నకు ముందుగానే యూరియా నిల్వ చేయకూడదని మరియు నానో యూరియా వాడకం వలన కలుగు లాభాలు నష్టాలు గురించి విశ్లేషించినారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిఎస్ మానస. సొసైటీ సిఈఓ మారగాని శ్రీనివాసరావు. వ్యవసాయ విస్తరణ అధికారి రాము, తేజ. మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 27









