ముఖ్య అతిథులుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 24: తెలంగాణ ప్రభుత్వం ఆత్మా కమిటీ చైర్మన్గా నియమించిన సుంకవల్లి వీరభద్రం ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం అశ్వారావుపేటలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమం శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నారు. వారితో పాటు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు పొందెం వీరయ్య మరియు మువ్వా విజయ్ బాబు కూడా పాల్గొననున్నారు. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ వీరభద్రం తన ప్రసంగంలో రైతుల సంక్షేమం కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు, వీరభద్రం శ్రేయోభిలాషులు, అభిమానులు, అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలుపనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం, వీరభద్రం తన అతిథులందరికీ విందు ఏర్పాటు చేశారు.









