.
42 వ డివిజన్ కార్పొరేటర్ పాకాలపాటి విజయ నిర్మల శేషగిరి.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం పట్టణంలో గల స్థానిక 42వా డివిజన్ నిజాంపేట్ రాతి దర్వాజ్ వద్ద దుర్గా దేవి నవరాత్రులలో భాగంగా మైసమ్మ త్రి శక్తి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామత మండపం వద్ద మహా అన్న ప్రసాద కార్యక్రమన్నీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మల యుగందర్ ప్రారంభించారు. భక్తి శ్రద్దలతో దుర్గ మాత పూజలు చేస్తూ, అన్నదానం కార్యక్రమం చేయటం చాలా శుభ పరిణామం అని ఆయన అన్నారు. దగ్గరుండి ఈ కార్యక్రమం నిర్వహించిన స్థానిక 42 వ డివిజన్ కార్పొరేటర్ పాకలపాటి విజయనిర్మల శేషగిరిని తుమ్మల యుగంధర్ ప్రత్యేకంగా అభినందించారు. 42 వ డివిజన్ లో ఉన్నా ప్రజలందరు చాలా సంతోషంగా దసరా పండగ జరుపుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దుర్గ మాత కమిటీ మెంబెర్స్, వీరితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత రావు, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అశ్రీఫ్, డివిజన్ ప్రెసిడెంట్ గౌస్ పాషా, సామద్,రాంబాబు, రమేష్ షోకత్,రెహమాన్, నసీమ, పర్వీన్,తదితరులు పాల్గొన్నారు









