+91 95819 05907

అశ్వరావుపేట ఆదివాసీ రైతుల దీక్షకు జీఎస్ఎస్ యువజన నాయకుడు అరేం ప్రశాంత్ సంఘీభావం

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం: అశ్వరావుపేట ఆదివాసీ రైతుల దీక్షకు జీఎస్ఎస్ యువజన నాయకుడు అరేం ప్రశాంత్ సంఘీభావం

‘మా భూములు మాకివ్వండి’: కలెక్టరేట్ ఎదుట మూడో రోజుకు చేరిన రామన్నగూడెం రైతుల ఆత్మగౌరవ నిరాహార దీక్ష

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామ ఆదివాసీ రైతులు తమ భూముల సమస్యపై చేస్తున్న ఆత్మగౌరవ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న ఈ దీక్షకు GSS జీఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ సంఘీభావం తెలిపారు.

ముఖ్య డిమాండ్లు:

సర్వే నెం. 30, 36, 39లోని ఆదివాసీ పట్టా భూములను అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్త సర్వే నిర్వహించి వెంటనే రైతులకు అప్పగించాలి.

గతంలో నిర్వహించిన జాయింట్ సర్వే రిపోర్టు వివరాలను రెవెన్యూ అధికారులు వెల్లడించాలి.

ఆదివాసీ రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి.

కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలి.

అంకమ్మ వెంకమ్మ చెరువు వరద కాలవ కారణంగా నష్టపోయిన రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం మంజూరు చేయాలి.

రామన్నగూడెం గ్రామంలో అర్హత ఉన్న ఆదివాసీ రైతులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.

ఈ సందర్భంగా అరేం ప్రశాంత్ మాట్లాడుతూ, ఉన్నతాధికారుల హామీని కూడా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ రాష్ట్ర నాయకులు సోయం సత్యనారాయణ, తోగూడెం మాజీ ఎంపీపీ మడవి సరస్వతి, ఆదివాసీ నాయకులు సోయం లక్ష్మయ్య, పునేం నాగేశ్వరావు, రామన్నగూడెం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !