చట్టబద్ధతలేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి
– ఆదివాసి జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ
పినపాక
ఆర్టికల్ 34 ప్రకారం చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో జరిగిన ఆదివాసి సంఘాల జేఏసీ సమావేశానికి జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లుగా లంబాడాలు ఆదివాసీల రిజర్వేషన్లు పొందుతూ ఉద్యోగ ఉపాధి, వైద్య, విద్యలో ఆదివాసీల అవకాశాలను పొందుతున్నారన్నారు.సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు లంబాడాలకు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దని డిమాండ్ చేశారు. ఈనెల 28న భద్రాచలంలో నిర్వహించే ఆదివాసీ సభకు భారీ సంఖ్యలో గిరిజనులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ మండల నాయకులు తోలెం శ్రీనివాసరావు,సోలం అశోక్, కుంజా కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.









