+91 95819 05907

చీకటి పాలన’పై బీజేపీ ఆగ్రహం: దమ్మపేటలో విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన

‘చీకటి పాలన’పై బీజేపీ ఆగ్రహం: దమ్మపేటలో విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన

విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, చిరు వ్యాపారులు

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, సెప్టెంబర్, 26:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో నిరంతరాయ విద్యుత్ అంతరాయంపై ప్రజలు, వ్యాపారుల తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, దీనిపై స్థానిక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు తీవ్రంగా స్పందించారు. మండలంలోని మందలపల్లి విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించి, అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చీకట్లో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని తీవ్రంగా విమర్శించారు. మండల వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం తీవ్రంగా ఉండటంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. “పగలు-రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు కరెంటు పోతుందో-వస్తుందో అన్న కనీస సమాచారం కూడా ఇచ్చే పరిస్థితిలో దమ్మపేట మండల విద్యుత్ అధికారులు లేరు. అంతేకాకుండా, విద్యుత్తు మరమ్మత్తుల పేరుతో నెలల తరబడి కేవలం కాలయాపన చేస్తున్నారు” అని వారు ఆరోపించారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే మేలుకుని, కరెంటు అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ తరపున వారు డిమాండ్ చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ విశ్వేశ్వర రావు, నియోజవర్గ నాయకులు తంబల రవి, గుడ ముత్యాలరావు, నాగరాజు, చందు, నరేష్, రత్నకుమారి, సుజాత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !