స్థానిక ఎన్నికలకు సిపిఎం సిద్ధం….
సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం
నేటి గదర్ న్యూస్, వైరా:-
నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న కమ్యూనిస్టులను స్థానిక ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలని, స్థానిక ఎన్నికలకు సిపిఎం సిద్ధంగా ఉందని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం తెలిపారు. శనివారం సిపిఎం వైరా మండల కమిటీ సమావేశం స్థానిక బోడెపూడి భవన్ లో డివిజన్ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగినది. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భూక్యా వీరభద్రం మాట్లాడుతూ ఇప్పటివరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు లేక అధికారుల పరిపాలనలో అస్తవ్యస్తంగా తయారైందని, రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపిందని విమర్శించారు, అన్ని గ్రామాల్లో మండలాల్లో సిపిఎం ఆధ్వర్యంలో సమస్యలపై సర్వేలు నిర్వహించి గ్రామపంచాయతీ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాలు వద్ద సమస్యలు పరిష్కరించాలని ప్రజల పక్షాన పోరాడిందని, భవిష్యత్తులో కూడా పోరాడుతుందని ఆయన తెలిపారు, ప్రజా సమస్యలపై స్థానిక సమస్యలపై పోరాడుతున్న సిపిఎం ను ప్రజలు బలపర్చాలని ఎన్నికల్లో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు, ప్రభుత్వాలను ప్రశ్నించి పోరాడి నిధులు సాధించాలంటే సిపిఎం గెలవటమే మార్గమని ఆయన గుర్తు చేశారు, స్థానిక ఎన్నికలకు సిపిఎం శ్రేణులు సిద్ధం కావాలని ప్రజల మద్దతును కూడగట్టాలని కోరారు, సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, వైరా మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, డివిజన్ కమిటీ సభ్యులు తుము సుధాకర్, మండల నాయకులు బాజోజి రమణ, కిలారు శ్రీనివాసరావు, మేడా శారాబంది, షేక్ మజీద్, శీలం వెంకట్ రెడ్డి, కారుమంచి జయరావు తదితరులు పాల్గొన్నారు.









