నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం : తిరుమలాయపాలెం మండలానికి చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటగా సీఎంఆర్ఎఫ్ సహాయం అందింది. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. మొత్తం 80 మంది లబ్ధిదారులకు రూ.25.33 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… “కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ధ్యేయం అన్నారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు సీఎంఆర్ఎఫ్ ప్రజలకు రక్షణ కవచంలా నిలుస్తోందని పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి చొరవతో గత ప్రభుత్వం కంటే త్వరగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం శ్రీను, మాజీ ఎంపీపీలు కొప్పుల అశోక్, బోడ మంగీలాల్, అరవింద్ రెడ్డి, ఉన్నం రాజశేఖర్, మండల పార్టీ ఇన్చార్జ్ గుర్రాల శ్రీనివాసరెడ్డి, జడల నగేష్ గౌడ్, పోట్ల కిరణ్, అంబేద్కర్, తాటికొండ కిరణ్, దుదిమెట్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.









