అధర్మం పై గురిపెట్టిన ఆదివాసీల విల్లంబులు.
*తమది న్యామమైన డిమాండ్ అన్న సంఘాలు*
*ఎన్నో సంవత్సరాలు గా నష్టపోతున్నామని ఆవేధన*
*తమ డిమాండ్ పరిష్కరించేవరకు పోరాటం ఆగదని వెల్లడి*
*దర్మయుద్దం సభకు ఊహించని విధంగా పోటెత్తిన ఆదివాసి సమాజం*
నేటి గదర్ ప్రతినిధి ,భట్టా భిక్షపతి(కరకగూడెం)భద్రాచలం:
:ఎన్నో ఏండ్లుగా నష్టపోతూ, గోసపడుతున్న ఆదివాసీలకు ప్రభుత్వాలు ఇకనైనా న్యాయం చేయాలని, తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కారించాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లంబాడీ లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం భద్రాచలం లో నిర్వహించిన ఆదివాసీ ల ధర్మయుద్దం సభ ఊహించని రీతిలో ప్రజలు రావడంతో సభ పరిసర ప్రాంతాలతో పాటు భద్రాచలం పట్టణం మొత్తం ఆదివాసీలతో నిండిపోయింది. ఈ సభలో వేలాది మంది ఆదివాసీలు స్వచ్చందంగా భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నిజమైన ఆదివాసీల హక్కులు కాపాడాలని, తాము అన్యాయం భరించబోమని స్పష్టంచేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే క్రమంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తమకు న్యాయం జరగలేదని, ప్రభుత్వాలు తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కారించే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. ఈ సభకు ఆదివాసీ మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వక్తలు తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ తొమ్మిది తెగల జాయింట్ యాక్షన్ చైర్మన్ చుంచ.రామక్రిష్ణ,అదిలాబాదు మాజీ ఎంపీ సోయం.బాబూరావు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా.కాంతారావు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి చైర్మెన్ భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









