స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపీడీవో సునీల్ కుమార్ అన్నారు. సోమవారం పినపాక మండలం ఈ.బయ్యారం క్రాస్ రోడ్ లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో
ఎంపీడీవో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చిన విజయవంతంగా చేపట్టేందుకు సిధ్ధంగా ఉండాలని అన్నారు. అన్ని అంశాలపై అవగాహన పెంచుకొని అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందకు సాగాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఏమైనా అనుమానాలు, సందేహాలు, ఇబ్బందులుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు
Post Views: 33









