నేటి గదర్ న్యూస్, వైరా:-
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డ్ నందు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం నందు, డాక్టర్ ఓర్సు వెంకటేశ్వర్లు, తైవశ్రీ దంపతుల ఆధ్వర్యంలోని సుమారు రెండు లక్షల 50 వేల రూపాయలు విలువ చేసే బంగారం అమ్మవారి దేవాలయానికి ఆలయ కమిటీ చైర్మన్ వేముల శివకృష్ణ ఆధ్వర్యంలో అందజేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం లో అమ్మవారిని కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని.దీనిలో భాగంగానే అమ్మవారికి రెండు లక్షల 50 వేల రూపాయలు విలువచేసే బంగారం దానితోపాటుగా కొంత నగదు గుడి నిర్వాహకులకు అందుచేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఆలయ చైర్మన్ వేముల శివకృష్ణ ,ఆలయ అర్చకులు రాజశేఖర్, రాము, బాలయ్య,ఆంజనేయులు, ఏడుకొండలు, తిరుపతి శ్రీనివాసరావు,ఓర్సు శ్రీను, తిరుపతిరావు,తురక చిన్న రాములు, పల్లపు రాంబాబు, శ్రీరాములు, రాజు, కృష్ణ, భక్తులు ,మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.









