అభివృద్ధి అంటే భట్టి-భట్టి అంటే అభివృద్ధి
రామ కృష్ణాపురం సభ లో మల్లు నందిని విక్రమార్క.
పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ లో కి చేరికలు
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
చింతకాని మండల పరిధిలోని రామ కృష్ణాపురంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క శుక్రవారం రాత్రి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం సభలో తిరపతి గోవిందరావు మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో విజయం కోసం అందరూ సహకరించాలని,ఇదే నా చివరి ఎన్నికలు అని అన్నారు గాదె రామారావు విజయం కోసం ఎంతో కష్టపడి పనిచేయాలి అని కోరారు.మల్లు నందిని విక్రమార్క మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో ని ప్రజలకు రుణపడి ఉంటామని తెలిపారు.ఓటు వేసి భట్టి విక్రమార్కను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,విద్యుత్ శాఖమంత్రి చేశారు అంటే మీ అందరి మద్దతు తో మీ అందరి కోసం పని చేసే అవకాశం లభించింది అని అన్నారు అభివృద్ధి అంటే భట్టి విక్రమార్క-భట్టి విక్రమార్క అంటే అభివృద్ధి అని తెలిపారు.మండలంలోవచ్చే ఎన్నికల్లో కొత్త,పాత నాయకులు అంటూ ఏమీ లేకుండా అందరూ కలిసి పని చేయాలని గాదె రామారావు గెలుపు కోసం కృషి చేయాలి అని కోరారు ,మీ మండలంలో,గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించాలని కోరారు.మీ మీ గ్రామంలో అభివృద్ధి కి కలిసి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అనంతరం రామ కృష్ణ పురం గ్రామంలో అరవై కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు,వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి మల్లు నందిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చింతకాని,ముదిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు,ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ ఉప అధ్యక్షులు మడుపల్లి భాస్కర్ గౌడ్,కన్నెబోయిన గోపి,బందెల నాగార్జున,మాజీ సర్పంచ్ తిరపతి గోవిందరావు,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కిలారు మనోహర్, కూరపాటి కిషోర్ ఆత్మ కమిటీ సభ్యులు కొప్పుల గోవిందరావు,సట్టు వెంకటేశ్వర్లు,తోటకూరా ప్రగతి,గాదె రామారావు,తిరుపతి యదయ్య,కోపూరి పూర్ణయ్య,పెంట్యాల పుల్లయ్య,నెల్లూరి కోటి,తూము కోటేశ్వర్రావు,తూము అంజయ్య,కంచుమర్తి రామకృష్ణ,షేక్ ఖాసీం,పాషా,వనం చిన్నప,అబ్దుల్ మజీద్ మరియు తదితరులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు .









