నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 04: బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకి కేంద్రంలో అరుదైన గౌరవం దక్కడంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి హర్షం వ్యక్తం చేశారు. పెట్రోలియం, సహజ వాయు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం లో సభ్యుడిగా ఆయన వరుసగా మూడోసారి నియామకం కావడంపై ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి మాట్లాడుతూ వద్దిరాజు రవిచంద్ర కి దక్కిన ఈ గౌరవం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని అన్నారు. పెట్రోలియం, సహజ వాయువు వంటి కీలక రంగాల విధాన రూపకల్పనలో కీలకపాత్ర పోషించే ఈ స్థాయి సంఘంలో మూడోసారి స్థానం దక్కడం ఆయన నిబద్ధత, అనుభవం, సమర్థతకు నిదర్శనమని కొనియాడారు. బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ లీడర్గా, రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం, అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ రవిచంద్ర నిరంతరం కృషి చేస్తున్నారని సున్నం నాగమణి పేర్కొన్నారు. ఈ నియామకం ద్వారా భవిష్యత్తులో దేశ ఇంధన రంగంలో మార్పులకు కృషి చేస్తూ, ప్రజలకు మరింత చేరువవుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వద్దిరాజు రవిచంద్ర తమ సేవలను ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షిస్తూ, వారికి తన మరియు అశ్వారావుపేట నియోజకవర్గం ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలిపారు.









