కలిసి వచ్చే వామపక్ష ,లౌకిక పార్టీలతో పొత్తులకు సిపిఎం సిద్ధం…
సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ.
నేటి గదర్ న్యూస్,కొణిజర్ల:-
ప్రజల పక్షాన పోరాడుతున్న వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ లు కోరారు, సిపిఎం కొణిజర్ల మండల కమిటీ విస్తృత స్థాయి సమావేశం బోయినపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన కొణిజర్ల సిపిఎం కార్యాలయంలో జరిగింది, సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసొచ్చే వామపక్ష లౌకిక పార్టీలతో ఎన్నికల సర్దుబాటు చేసుకోవడానికి సిపిఎం సిద్ధంగా ఉందని వారు తెలిపారు, మండలంలో ఎనిమిది ఎంపిటిసి స్థానాలతో పాటు జడ్పిటిసి స్థానానికి పోటీ చేయాలని పార్టీ మండల కమిటీ నిర్ణయించిందని వారు తెలిపారు, మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సిపిఎం ఎర్రజెండా పోరాడిందని, భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన పోరాడుతుందని ప్రజలు ఆలోచించి తమ పక్షాన పోరాడే సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు, రైతుల సమస్యలతో పాటు పోడు భూముల సమస్య వివిధ గ్రామాల స్థానిక సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించామని, గతంలో సిపిఎం ఆధ్వర్యంలో సర్పంచ్లు ,ఎంపీటీసీ, ఎంపీపీ పరిపాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సిపిఎం చేపట్టిందని గుర్తు చేశారు, స్థానిక సంస్థల్లో సిపిఎం గెలిస్తేనే ప్రజా పాలన, నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తారని అన్నారు, ఎన్నికల రంగంలో సిపిఎం గెలుపు కోసం పార్టీ శ్రేణులు కష్టపడి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు, సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు, సీనియర్ నాయకులు కొప్పుల కృష్ణయ్య, మండల నాయకులు మోత్కూరి వెంకటేశ్వరరావు, చింతపల్లి ప్రసాద్, మాజీ సర్పంచ్ పుల్లూరి వెంకటేశ్వర్లు, తాళ్లపల్లి విజయ, బానోతు హరిచంద్, తేజావత్ సీతారాములు, లింగాల దానయ్య, షేక్ అఫ్జల్, కట్టా రాంబాబు, బుర్రి గోపయ్య, ధారగాని రాములు, షేక్ మహబూబ్ అలీ, కంపాసాటి శివ, బోమ్మగాని భాస్కర్, మురికిపూడి నాగేశ్వరరావు, కాల్వకొలను రామారావు, తదితరులు పాల్గొన్నారు.









