తెలంగాణలో పక్కదారి పడుతున్న సన్నబియ్యం
మహారాష్ట్రకు భారీగా అక్రమ రవాణ
కేజీకి రూ.10 నుండి రూ.15 ఇచ్చి లబ్ధిదారుల నుండి కొనుగోలు చేస్తున్న దళారులు
తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇస్తున్న సన్నబియ్యం భారీగా అక్రమ రవాణాకు గురవుతున్నా కనీసం పట్టించుకోని అధికారులు
మంథని, పెద్దపల్లి, గోదావరిఖని లాంటి బార్డర్ ప్రాంతాలలో మధ్యతరగతి లబ్ధిదారుల నుండి సన్నబియ్యం సేకరించి, మహారాష్ట్రలోని సిరోంచ ప్రాంతానికి తరలిస్తున్న దళారులు
మార్కెట్లో కేజీ ధర రూ.50 నుండి రూ.90 ఉన్నందున భారీగా పక్కదారి పడుతున్న సన్నబియ్యం
అధికారులు కనీసం పట్టించుకోవడంలేదని, స్మగ్లర్లపైన నామమాత్రంగా కేసులు పెట్టి వదిలేస్తున్నారని ఆరోపణలు
ఇప్పటికైనా అధికారులు నిద్ర లేచి సన్నబియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు
Post Views: 17









